550 సార్లు రీరిలీజైన ఏకైక ఇండియన్ సినిమా..

by Disha Web Desk 13 |
550 సార్లు రీరిలీజైన ఏకైక ఇండియన్ సినిమా..
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అందుకున్నాయి. కానీ ఒక చిత్రం మాత్రం ఏకంగా 550 సార్లు రీరిలిజ్ అయింది. విడుదలైన ప్రతీసారి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. కన్నడ ‘ఓం’ మూవీ. ఉపేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా నటించారు.

మొట్టమొదట ఈ మూవీ 1995లో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ20 ఏళ్ల కాలంలో ఈ సినిమాను 550 సార్లు రీరిలీజ్ చేశారు. మొదటి సారి విడుదలైనప్పుడు రూ. 10 కోట్ల గ్రాస్‌ను సాధించగా.. రెండోసారి రీరిలీజ్ రూ.12 కోట్ల గ్రాస్ సాధించింది. అలా మొత్తం ఇప్పటి వరకు సుమారు 550 సార్లు రీరిలీజ్ అయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read More: కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ ట్రైలర్‌.. అదిరిపోయింది..!!

హీరో విక్రమ్‌పై నిందలు మోపిన బాలీవుడ్ డైరెక్టర్.. కౌంటర్ ఇచ్చిన చియాన్



Next Story

Most Viewed